రష్మిక మందన్న హవా బాలీవుడ్ లో అంతకంతకు పెరుగుతోంది. యానిమల్, చావా లాంటి బ్లాక్ బస్టర్లతో రష్మిక రేంజ్ స్కై ఈజ్ లిమిట్! అన్న చందంగా ఎదిగింది. ఒక్కో సినిమాకి రూ.4-5 కోట్ల పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవల రూ.6 కోట్ల రేంజులో పారితోషికాన్ని కోట్ చేస్తోందని తెలుస్తోంది.
అయినా రష్మికకు బాలీవుడ్ లో డిమాండ్ తగ్గలేదు. ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఫ్రాంఛైజీలో ప్రముఖ హీరోయిన్ లను రీప్లేస్ చేస్తోందని తెలిసింది. సైఫ్ ఖాన్- దీపిక- డయానా పెంటి తారాగణంగా హోమి అదజానియా రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ కాక్ టైల్ సీక్వెల్ లో రష్మిక మందన్న అవకాశం అందుకుందని తెలిసింది.
ఈ సీక్వెల్ చిత్రంలో షాహిద్- రష్మిక- కృతి సనోన్ లను ప్రధాన తారాగణంగా హోమి ఫిక్స్ చేసుకున్నారు. కాక్ టైల్ రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో సైఫ్- దీపిక రొమాన్స్ ఒక రేంజులో వర్కవుటైంది. ఇప్పుడు అదే స్థాయిలో షాహిద్ తో కథానాయికల రొమాన్స్ వర్కవుట్ చేయాలని హోమి అదజానియా- దినేష్ విజన్- లవ్ రంజన్ (రచయిత) బృందం ప్లాన్ చేస్తోందని తెలిసింది. `కాక్టెయిల్ 2` వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయాలనేది ప్లాన్. ఇండియా, యూరప్ లలో షూటింగ్ చేయనున్నారు.