ఈమధ్యన హీరోయిన్ సాయి ధన్సిక ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టుగా ప్రకటించిన హీరో విశాల్ కు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా విశాల్ కి మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విశాల్ను లైకా ప్రొడక్షన్స్కు రూ. 21.29 కోట్ల రుణాన్ని 30% వడ్డీతో చెల్లించాలని మద్రాస్ హైకోర్టు 2025 జూన్ 5న ఆదేశించింది.
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కోసం విశాల్ గతంలో ఫైనాన్షియర్ అన్బుచెళియన్ నుంచి రూ. 21.29 కోట్ల రుణం తీసుకున్నాడు. అయితే ఆ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది, లైకా ఆ రుణాన్ని చెల్లించినందుకు గాను విశాల్ తన వీరమే వాగై సూడుమ్ హక్కులను లైకాకు ఇవ్వాలన్న ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
విశాల్ తమ ఋణం చెల్లించకుండా, సినిమా హక్కులు ఇవ్వకుండా మోసం చేసాడని.. లైకా నిర్మాతలు కోర్టుకెక్కారు. రెండున్నర ఏళ్ళ విచారణ తర్వాత, మద్రాస్ హై కోర్టు విశాల్ను రూ. 21.29 కోట్లను 30% వడ్డీతో చెల్లించాలని బిగ్ షాక్ ఇచ్చింది. మరి విశాల్ ఇప్పుడేం చేస్తాడో చూడాలి.