మహేష్-ప్రియాంక ఎవ్వరైనా పాటించాల్సిందే

రాజమౌళి తో వర్క్ చెయ్యడమంటే.. మాములు విషయం కాదు. సున్నితంగా, హ్యాండ్ సమ్ గా కనిపించే మహేష్ రాజమౌళి చేతుల్లో పడ్డాక ఎలా ఐపోతారో అనేది మహేష్ అభిమానుల బాధ. అయినప్పటికి రాబోయే సక్సెస్ గురించి అలోచించి కామ్ అవుతున్నారు. ఇక రాజమౌళి ఇప్పుడొక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారట.
తన ప్రాజెక్ట్ వివరాలు తాను ప్రకటించకుండా ఏ ఒక్కరు బయట పెట్టడానికి వీలులేదు, అంతేకాకుండా సెట్ లోకి ఫోన్ లు కూడా ఎలవ్ లేవు అని మహేష్ దగ్గర నుంచి ప్రియాంక చోప్రా వరకు, టెక్నీకల్ టీం దగ్గర నుంచి సెట్ బాయ్ వరకు అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా తీసుకున్నారట.
SSMB 29 కి సంబందించిన ఏ విషయమైనా అంటే కథ, షూటింగ్ వివరాలు, ఇందులో నటించబోయే నటుల గురించి ఏ విషయాలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించి మరీ యూనిట్ కి హెచ్చరికలు జారీచేశారట రాజమౌళి. ఈ విషయంలో మహేష్ అయినా, ప్రియాంక అయినా రాజమౌళి ఆజ్ఞ పాటించాల్సిందే అంటున్నారు.
Rajamouli Takes Extra Precautions To Prevent Leaks From His Film With Mahesh
Rajamouli Takes Extra Precautions To Prevent Leaks





































