Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Adah Sharma reportedly met with the accident

తాను సేఫ్ అంటున్న హీరోయిన్

Adah Sharma reportedly met with the accident

ది కేరళ స్టోరీ హీరోయిన్ ఆదా శర్మ తో పాటుగా కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ ముంబైలో యాక్సిడెంట్ కి గురయ్యారు. ఓ ప్రవేట్ పార్టీకి వెళుతుండగా.. వీరికి ప్రమాదం జరిగింది. దానితో వెంటనే వారిద్దరిని హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లుగా సుదీప్తో సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే అందరూ ఆదా శర్మ కి ఎక్కువ ప్రమాదం జరిగిందేమో అని అందరూ కంగారు పడ్డారు. కరీంనగర్ లో జరిగే సభకి వెళ్లి కేరళ స్టోరీ గురించి మాట్లాడాల్సి ఉండగా.. అనారోగ్య కారణాల వలన వెళ్లలేకపోతున్నామని.. కరీంనగర్ వాసులకి క్షమాపణలు చెప్పారు సుదీప్తో సేన్.

అయితే తర్వాత అదా శర్మ స్పందిస్తూ.. తనకి ఈ ప్రమాదంలో పెద్దగా ఏమి అవ్వలేదని, ఎవరూ కంగారు పడవద్దు అంటూ పోస్ట్ పెట్టింది. దానితో అదా శర్మ అభిమానులు ఊరట పడుతున్నారు. కొద్దిరోజులుగా క్రేజ్ లో లేని ఆదా శర్మ మళ్ళీ ది కేరళ స్టోరీ తో లైమ్ లైట్ లోకి వచ్చింది. కేరళ స్టోరీ వివాదాలు అదా శర్మని పాపులర్ చేసాయి.

The Kerala Story: Adah Sharma and Sudipto Sen meet with accident

the kerala story
adah sharma