Advertisement

భక్తులపై నయనతార ఆగ్రహం

Fri 07th Apr 2023 11:04 AM
nayanthara,vignesh shivan  భక్తులపై నయనతార ఆగ్రహం
Nayanthara Lost Her Cool At Kumbakonam Temple భక్తులపై నయనతార ఆగ్రహం
Advertisement

నయనతార-విగ్నేష్ శివన్ లు గత ఏడాది పెళ్లి చేసుకునే ముందు, పెళ్లి చేసుకున్న తర్వాత పలు ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హనీమూన్, సరోగసి ద్వారా ట్విన్స్ ని ఎత్తుకోవడం.. ఇవన్నీ లీగల్ సమస్యలకు దారి తీసినా నయనతార-విగ్నేష్ శివన్ లు అవన్నీ ఎదుర్కొని.. ప్రస్తుతం పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యనే తమ ట్విన్స్ పేర్లు రివీల్ చేసిన ఈ జంట ఏప్రిల్ 5 న కుంభకోణం టెంపుల్ కి స్పెషల్ పూజల కోసం వెళ్లారు.

ఆ రోజు గుడికి వెళుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తర్వాత టెంపుల్ లో నయనతార-విగ్నేష్ శివన్ లు పూజలు నిర్వహిస్తున్న సమయంలో భక్తులు గొడవకు దిగడమే కాకుండా.. నయన్-విగ్నేష్ ల ఫొటోస్ , వీడియోస్ తియ్యడానికి ఎగబడడంతో.. నయనతార ఆగ్రహంతో.. మేము ఓ ఐదు నిమిషాలుంటే వెళ్ళిపోతాము, ఐదు నిమిషాల్లో మా పూజ పూర్తవుతుంది. మీలాగే మేము దైవ దర్శనానికి వచ్చాము అంటూ అక్కడ భక్తులపై విరుచుకుపడినట్లుగా తెలుస్తుంది.

Nayanthara Lost Her Cool At Kumbakonam Temple:

Nayanthara and Vignesh Shivan Visit Their Deity Temple

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement