కళాతపస్వి విశ్వనాథ్ గారి సతీమణి కన్నుమూత

గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాగారు కాలం చేసిన రెండు నెలలకే సూపర్ స్టార్ కృష్ణగారు కన్నుమూశారు. ఘట్టమనేని ఫ్యామిలిని వారిద్దరి మరణాలు తీవ్ర ఆవేదనకి గురిచేసింది. భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆవిడతో తనకెంత అనుబంధం ఉందో అంటూ ఆమెతో పాటే కృష్ణ గారు కాలం చేసారు. మళ్ళీ ఇప్పడు కళాతపస్వి విశ్వనాథ్ గారు మరణించిన కొద్దిరోజులకే ఆయన సతీమణి జయలక్ష్మి గారు కన్నుమూయడం మరింత బాధాకర విషయం.
విశ్వనాథ్ గారు మరణించిన 22 రోజులకే అనారోగ్యంతో రాజ్యలక్ష్మిగారు ఈరోజు ఆదివారం కన్నుమూశారు. విశ్వనాథ్ గారు కన్నుమూసిన కొద్దిరోజులకే ఆయన భార్య తీవ్ర అనారోగ్యంతో తనువు చలించడం అనేది నిజంగా వారి మధ్యన అనుబంధం.. వారి మధ్యన ఆప్యాయతకు నిదర్శనం. వివాహం అయ్యాక ఒకరికొకరు తోడు నీడగా బ్రతికిన వారు.. ఇప్పుడిలా రోజుల వ్యవధిలో వెళ్లిపోవడం మనసు పిండేసే సంఘటన.
K Vishwanath Wife Jayalakshmi passed away
K Vishwanath Wife Jayalakshmi Died







































