Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiranjeevi, Pawan and Jr NTR pay tribute to to Jamuna

జమున మృతి: చిరు-పవన్-తారక్ సంతాపం

Chiranjeevi, Pawan and Jr NTR pay tribute to to Jamuna

సీనియర్ నటి జమున ఈ శుక్రవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో అనారోగ్య కారణాలతో కన్ను మూసారు. జమున మృతి పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జమున మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసారు.

మెగాస్టార్ చిరంజీవి: సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను

పవన్ కళ్యాణ్: ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

జూనియర్ ఎన్టీఆర్: దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు,  మరెన్నో  వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో  చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

Chiranjeevi, Pawan and Jr NTR condolence to Jamuna

chiranjeevi
pawan kalyan
jr ntr