Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Radhe Shyam: Rajamouli to interview Prabhas

ఎన్టీఆర్, చరణ్ ని పక్కన పెట్టిన రాజమౌళి!

Radhe Shyam: Rajamouli to interview Prabhas

మరో రెండు వారాల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి RRR తో రెడీ అవుతున్నారు జక్కన్న అండ్ టీం. ఈ సినిమా ప్రమోషన్స్ ని జనవరి నుండి ఆపేసారు. మిగతా బాలన్స్ ప్రమోషన్స్ ఈ రెండు వారాల్లో చేయాల్సివుంది కానీ రాజమౌళి ఈ సినిమా ని అసలు పట్టించుకోవడం లేదు. ఇపప్టివరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ అంతా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని చూస్తుంటే... ఎన్టీఆర్, చరణ్ ని పక్కన పెట్టి రాధే శ్యామ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు రాజమౌళి. అదేంటి రాజమౌళి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్నారా...

మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వనున్న రాధే శ్యామ్ ని ప్రమోట్ చేయాలని రాజమౌళి రంగంలోకి దిగారు. అందుకే ఆ సినిమా కి సంబంధించి ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేసారు, ఆ ఇంటర్వ్యూ ఈరోజో రేపో రిలీజ్ కాబోతుంది. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ - రాజమౌళి ఇద్దరూ బాహుబలి 3 గురించి ఓ క్లారిటీ కూడా ఇచ్చారని తెలుస్తుంది. రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో ప్రభాస్, బాహుబలి సిరీస్ ని అయితే వదలం అని ఓ క్లారిటీ ఇచ్చారు కానీ జక్కన్న అయితే ఇప్పటివరకు ఎక్కడా దీని గురించి చెప్పలేదు. కానీ ఇద్దరు కలిసి ఈ ఇంటర్వ్యూ లో ఓ క్లారిటీ అయితే ఇచ్చారని మాత్రం. ఒకరకంగా ఈ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చే న్యూస్. 

కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం రాజమౌళిపై గుర్రుగా ఉన్నారు. మన సినిమా వదిలేసి ప్రభాస్ కోసం రాజమౌళి పని చెయ్యడం ఏమిటో అంటూ.. వారికి నచ్చడం లేదు.

Prabhas and SS Rajamouli Reunite For Radhe Shyam

prabhas
ss rajamouli
radhe shyam
ntr fans
ram charan fans