Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu is the next chief guest on NTR Evaru Meelo Koteeswarulu

మహేష్ అన్నారు, ప్రభాస్ అన్నారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు జెమినీ ఛానల్ లో సోమవారం నుండి గురువారం వరకు ఓ గంటపాటు ప్రసారం అవుతుంది. ఆ షో కి ఎన్టీఆర్ హోస్ట్ అయినా.. అంతగా ఆదరణ లభించడం లేదు. కంటెస్టెంట్స్ గా వచ్చేవారు ఎన్టీఆర్ భజన చెయ్యడం.. ఇలాంటి గేమ్ షోస్ ని బుల్లితెర ప్రేక్షకులు అంతగా ఆదరించరనేది చిరు, నాగ్ లు హోస్ట్ లో మీలో ఎవరు కోటీశ్వరులు అప్పుడే అర్ధమైంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, ఆర్.ఆర్.ఆర్ హీరో యంగ్ టైగర్ ని తీసుకోస్తే షో కి ఆదరణ పెరిగి టీఆర్పీ భారీగా వస్తుంది అని జెమిని ఆశ పడింది. 

కానీ ఎన్టీఆర్ ఎంతగా ట్రై చేసినా.. ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హైప్ రావడం లేదు. ఓపెనింగ్ ఎపిసోడ్ కి రామ్ చరణ్ కి, తర్వాత కొరటాల, జక్కన్నలని గెస్ట్ లుగా పిలిచారు. ఆ తర్వాత మహేష్ బాబు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులకు గెస్ట్ గా వచ్చారు అంటూ పిక్స్ లీకయ్యాయి అంటూ హంగామా చేసారు. మహేష్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ షో కి గెస్టే అంటూ ప్రచారం జరిగింది. కానీ మహేష్ ఎపిసోడ్ లేదు, కనీసం ప్రోమో కూడా లేదు. ఇక ప్రభాస్ ఏం వస్తాడు అంటున్నారు. మరి మహేష్, ప్రభాస్ లు వస్తే అయినా షో కి క్రేజ్ వస్తుంది అనుకుంటే.. అది కూడా లేకపోయే.. 

Leaked Photo: Mahesh Babu to grace Jr NTR Evaru MeeloEvaru Meelo Koteeswarulu

Mahesh Babu is the next chief guest on NTR Evaru Meelo Koteeswarulu
mahesh babu
jr ntr
evaru meeloevaru meelo koteeswarulu
prabhas