మంత్రి పేర్ని నాని దగ్గరికి సినీ నిర్మాతలు

పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా ఇండస్ట్రీని వదల్లేదు. పవన్ వేడి చల్లారనే లేదు.. అప్పుడే సినీ పెద్దలు ఏపీ మినిస్టర్ పేర్ని నాని ని కలవడానికి బందర్ వెళ్లడం ఆసక్తిని కలిగిస్తుంది. గత కొన్నాళ్లుగా ఏపీ ప్రభుత్వంతో టికెట్ రేట్ల విషయంలో జరుగుతున్న మీటింగ్ ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలతో ఏపీ మినిస్టర్స్ అంతా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడినా.. సినిమా ఇండస్ట్రీ నోరు మెదపలేదు. పవన్ తో మాకు సంబంధం లేదన్నట్టుగా గప్ చుప్ గా ఉండిపోయారు.
ఇక ఈ రోజు బడా నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నాని ని మీట్ అవడం కోసం మచిలీ పట్నం వెళ్లారు. నానిని కలిసేందుకు వెళ్లిన వారిలో దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డివివి దానయ్య, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి లు ఉన్నారు. మరి పేర్ని నాని తో నిర్మాతలు పెట్టే మీటింగ్ అజెండా ఏమిటి అనేది తెలియకపోయినా.. మెయిన్ గా టికెట్ రేట్స్ విషయమే నిర్మాతలు మంత్రి తో భేటీ అయ్యారని.. మీటింగ్ తర్వాత నిర్మాతలు స్పందిస్తేనే కానీ ఏ విషయము తెలియదు.
AP Minister Perni Nani To Meet Tollywood Celebrities
Tollywood producers meets AP minister Perni Nani







































