Advertisement

కియారా అద్వాని పద్దతి మారింది

Wed 01st Sep 2021 05:12 PM
kiara advani,charging inr 4 cr,telugu film,ram charan,pan india movie,shershaah movie  కియారా అద్వాని పద్దతి మారింది
Kiara Advani hikes her remuneration కియారా అద్వాని పద్దతి మారింది
Advertisement

క్రేజీ హీరోయిన్ గా బాలీవుడ్ ని దున్నేస్తున్న కియారా అద్వానీ రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఎంపికయ్యాక ఆమె రేంజ్, క్రేజ్ సౌత్ లో బాగా పెరిగిపోయింది. మహేష్, రామ్ చరణ్ లతో చేసిన సినిమాలతో హీరోయిన్ గా మంచి పేరొచ్చినా.. కియారా మాత్రం బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కియారా కోసం పోటీ పడడం అందులో రామ్ చరణ్ మూవీలో కియారా ఫిక్స్ అవడం జరిగింది. అయితే ఈమధ్యన కియారా అద్వానీ బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా తో చేసిన షేర్షా మూవీ సూపర్ హిట్ అయ్యింది. 

ఆ సినిమా హిట్ అవడంతో కియారా అద్వానీ రేంజ్ మరింత పెరిగింది. అక్కడ బాలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న కియారా అద్వానీ షేర్షా ప్రమోషన్స్ లో తెగ హడావిడి చేసింది. అయితే షేర్షా హిట్ అవడంతో కియారా అద్వానీ ఇప్పుడు తన పద్దతి మార్చి రెన్యునరేషన్ పెంచేసింది అనే టాక్ మొదలైంది. తన దగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు తన పారితోషకం విషయంలో పక్కాగా ఉన్నాను.. అడిగింది ఇవ్వాల్సిందే అని, తనకి మంచి క్రేజ్ ఉంది అని అడిగేస్తుందట. ఇప్పటికే రామ్ చరణ్ పాన్ ఇండియా ఫిలిం కోసం కియారా అద్వానీ నాలుగు కోట్లు పైనే అందుకుంటుంది అనే టాక్ ఉంది. 

Kiara Advani hikes her remuneration:

Kiara Advani Is Charging INR 4 Cr For Her Next Telugu Film

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement