Advertisement

మరోసారి కన్నీళ్లు పెట్టుకున్న పాయల్

Thu 20th May 2021 12:46 PM
payal rajput,covid 19,corona second wave,payal shares emotional post,relatives death  మరోసారి కన్నీళ్లు పెట్టుకున్న పాయల్
Payal Rajput Shares Emotional Post మరోసారి కన్నీళ్లు పెట్టుకున్న పాయల్
Advertisement

కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం భారత దేశాన్ని కుదిపేస్తోంది. అయినవాళ్ళని కోల్పోయి రోడ్డున పడుతున్నవాళ్లు, లాక్ డౌన్ కారణంగా పేద ప్రజల ఆకలి కష్టాలు, కుటుంబాలకు కుటుంబాలే కరోనా తో కనుమరుగైపోయాయి. సెలబ్రిటీస్ కరోనా తో కన్నుముయ్యడమే కాదు.. ఆత్మీయులని కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్నారు. రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ తల్లిని ని కోల్పియిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజపుట్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ తో కన్నీటి పర్యంతమైంది. 

మరోసారి పాయల్ తన ఆత్మీయులని కోల్పోయినట్లుగా పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయని.. అందరూ ఇంటికే పరిమితమై తమ ప్రియమైన వారిని సంరక్షించుకోవాలని ఈ పోస్ట్ ద్వారా ఆమె తెలిపింది. అంతేకాదు.. నా జీవితంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు చూడటం ఇదే తొలిసారి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోయి చాలా ఆందోళన చెందుతున్నా. నా బాధను బయటకు చెప్పడానికి మాటలు చాలవు. బయటకొచ్చి గట్టిగా ఏడవాలనిపిస్తోంది. మొన్న అనిత ఆంటీని కోవిడ్ కారణముగా కోల్పోయాము.. ఇప్పుడు మరోసారి సన్నిహితమైన వ్యక్తి కోల్పోయాము.

సన్నిహితులను కోల్పోవడం నరకంతో సమానం. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా.. అంటూ పాయల్ చేసిన ఈఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.

Payal Rajput Shares Emotional Post:

Payal Rajput Shares Emotional Post about relatives death

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement