Advertisement

మెగా ఫాన్స్ కి షాక్

Wed 14th Apr 2021 03:41 PM
director shankar,ram charan,mega fans,shankar - ram charan combo,pan india movie,dil raju,ranveer sing,pen movies  మెగా ఫాన్స్ కి షాక్
Shankar shocks Ram Charan Fans మెగా ఫాన్స్ కి షాక్
Advertisement

ప్రస్తుతం ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ మూవీస్ తో బాగా బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తదుపరి మూవీ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో ప్రకటించాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో పలు భాషల్లో చరణ్ - శంకర్ మూవీ ని దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. అయితే చరణ్ - శంకర్ కాంబో మూవీ జులై నుండి కానీ, ఆగష్టు నుండి కానీ పట్టాలెక్కబోతుంది అని దిల్ రాజు మీడియా తో చెప్పాడు. తీరా చూస్తే ఇప్పుడు శంకర్ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో అపరిచుతుడు అంటే తమిళ బ్లాక్ బస్టర్ హిట్ అన్నియన్‌ (2005) చిత్రానికి రీమేక్ చెయ్యబోతున్నాడు. విక్రమ్ - సదా జంటగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన అపరిచుతుడు అప్పట్లో ఓ సెన్సేషన్.

ఇప్పుడు అదే మూవీని శంకర్ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో రీమేక్ చెయ్యబోతున్నాడు. ఆ విషయాన్నీ అధికారికంగా ఆ సినిమాని నిర్మిచబోయే నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ ప్రకటించింది. అంటే రామ్ చరణ్ తో శంకర్ మూవీ చెయ్యాలి.. మరి ఇప్పుడు రణవీర్ తో అపరిచితుడు రీమేక్ అంటే.. చరణ్ మూవీ ఏం కాను.. అసలు రామ్ చరణ్ - శంకర్ కాంబో అనగానే సినిమాపై అంచనాలు మొదలైపోయాయి. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడని, అలాగే హీరోయిన్ గా కియారా అద్వానీ అంటూ ప్రచారం జరుగుతుంది. దిల్ రాజు ఏమో హీరోయిన్ వేటలో ఉన్నామన్నా ఆల్మోస్ట్ కియారా అద్వానీని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు చరణ్ కి షాకిస్తూ శంకర్ ఇలా రన్వీర్ సింగ్ తో కోలాబ్రేట్ అవడం మెగా ఫాన్స్ కి మాములుగా షాకివ్వలేదు.

Shankar shocks Ram Charan Fans:

Director Shankar shocks Mega Fans

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement