Advertisement

షాక్: రానా, తమన్నా, కోహ్లీకి నోటీసులు!

Thu 05th Nov 2020 04:37 AM
madras high court,notices,virat kohli,saurav ganguly,tamannah bhatia,rana,online games  షాక్: రానా, తమన్నా, కోహ్లీకి నోటీసులు!
Madras High Court gives shock to Celebrities షాక్: రానా, తమన్నా, కోహ్లీకి నోటీసులు!
Advertisement

మద్రాస్ హైకోర్టు ఇప్పుడు సెలెబ్రిటీస్‌కి షాకిచ్చింది. ఆన్‌లైన్‌లో జరిగే గ్యాంబ్లింగ్‌ని ప్రోత్సహిస్తూ యాడ్స్‌లో పాల్గొన్న పలువురు సెలబ్రిటీస్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ రమ్మీ వలన చాలామంది ఆస్తులు పోగొట్టుకోవడమే కాదు.. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. వాటిని ఎంకరేజ్ చేస్తూ సెలబ్రిటీస్ ఆయా రకాల ఆన్ లైన్ గేమ్స్ కోసం పబ్లిసిటీ చేయడంపై కోర్టు సీరియస్ అయ్యింది.

ఈ రకమైన ఆన్ లైన్ గేమ్స్ ని ప్రోత్సహిస్తూ పబ్లిసిటీ చేసిన వారిలో క్రికెటర్స్ సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ సెలబ్రిటీస్ అయినా రానా, ప్రకాశ్ రాజ్, తమన్నా, సుదీప్ లకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ జూదాన్ని నిషేధించాలంటూ వేసిన పిల్ పై మద్రాస్ హైకోర్టు సెలబ్రిటీస్‌కి నోటీసులు జారీ చేసింది. మరి జూదాన్ని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించడం అనేది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. ఇక ఆన్ లైన్ జూదాన్ని మరో పది రోజుల్లో నిషేధించాలని చెప్పింది కోర్టు. మరి ఈ నోటీసులకు సెలబ్రిటీస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ నెల 19 నాటికి సెలబ్రిటీస్ కోర్టుకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని కోర్టు తెలిపింది.

Madras High Court gives shock to Celebrities :

Madras High Court Issues Notices To Virat Kohli, Saurav Ganguly, Tamannah Bhatia, Rana and Others

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement