విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్ సతీమణి అనూష వేలుస్వామి రాసిన పుస్తకం విడుదల
‘‘వాట్ ఈఫ్ రైన్ బౌస్ వర్ యువర్ షాడోస్’’ పుస్తకాన్ని రచించిన విలక్షణ దర్సకుడు విఐ ఆనంద్ సతీమణి అనూష వేలుస్వామి
‘టైగర్, ఎక్కడకి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ విఐ ఆనంద్, ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా తన సతీమణి అనూష వేలుస్వామి తొలిసారిగా రచించిన ఓ ఇంగ్లీష్ పోయెట్రీ పుస్తకం విడుదల అయినట్లుగా ఆనంద్ ప్రకటించారు. వాట్ ఈఫ్ రైన్ బౌస్ వర్ యువర్ షాడోస్ అనే టైటిల్ తో ఈ పుస్తకం పబ్లిష్ అయినట్లుగా ఆనంద్ తెలిపారు. ప్రేమ, ప్రాణులు, జీవం, జీవితం, వస్తువులు ఇలా పలు రకాలు అంశాలు ప్రేరణగా తీసుకొని వాటి మీద రాసిన అనేకనేక ఇంగ్లీష్ పోయెమ్స్ సమాహారం ఈ పుస్తకం అని ఆనంద్ తెలిపారు. నోషన్ ప్రెస్ డాట్ కామ్ వారు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. వారి వెబ్సైట్ తో తో పాటు అమెజాన్ లో ఈ పుస్తకం లభ్యం అవుతుంది అని విఐ ఆనంద్ అన్నారు.