Advertisement

ఇండియా-పాకిస్థాన్ బోర్డర్‌లో గోపీచంద్

Tue 22nd Jan 2019 05:05 PM
gopichand,ak entertainments,india and pakistan border,movie shooting starts  ఇండియా-పాకిస్థాన్ బోర్డర్‌లో గోపీచంద్
Gopichand New Film Starts at india and pakistan border ఇండియా-పాకిస్థాన్ బోర్డర్‌లో గోపీచంద్
Advertisement

ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీచంద్, డైరెక్టర్ తిరు , ఏకే ఎంటర్టైన్మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం..!!

యాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ సోమవారం ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమయ్యింది.. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.. యాభై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు.. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. వేసవి కానుకగా మేలో  సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. 

నటీనటులు  : గోపీచంద్

సాంకేతిక నిపుణులు :

కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: తిరు

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

బ్యానర్: ఎకే ఎంటర్టైన్మెంట్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి

సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి

రచయిత: అబ్బూరి రవి

ఆర్ట్: రమణ వంక

కో డైరెక్టర్ : దాసమ్ సాయి, రాజ్ మోహన్

పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ : విశ్వా CM

పి.ఆర్.ఓ : వంశీ శేఖర్

Gopichand New Film Starts at india and pakistan border:

Gopichand New Film Updates

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement