150 కోట్ల గ్రాస్ రాబట్టిందట..!

మన ఇండియాలో సూపర్ స్టార్ రజినీకి ఉన్న ఫ్యాన్స్ మరి ఏ హీరోకి ఉండరు. రజిని ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రజిని సినిమాలు వస్తున్నాయి అంటే విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. మరి తమిళనాడులో ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు.
రీసెంట్ గా అంటే పండగ కానుకగా రజిని పేట రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈచిత్రం వారం రోజుల్లో 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రజిని గత సినిమాలతో పోల్చుకుంటే ఈసినిమా చాలా బెటర్ అని చెబుతున్నారు .
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రజినిని యంగ్ గా .. స్టైలీష్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కంటెంట్ పరంగా కూడా సినిమా బాగుండడంతో ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కానీ తెలుగు పెట్ట అంత గొప్పగా ఆడటంలేదని ట్రేడ్ చెబుతుంది.
Petta Better than Kabali and Kaala
Rajinikanth Petta in 150 Crores Club






































