నేటి యంగ్ హీరోలలో నాని, శర్వానంద్ తర్వాత విజయ్దేవరకొండ, నారారోహిత్, సుధీర్బాబు, శ్రీవిష్ణు, నాగశౌర్య వంటి వారిని ప్రత్యేకంగా పేర్కొనాలి. ఇక విషయానికి వస్తే ఒక సినిమా హిట్టయిందంటే ఆ దర్శకుడిని వెతుక్కుంటూ చిత్రాలు వస్తాయి. స్టార్ హీరోలు సైతం వారితో పని చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఓ స్టార్ హీరో ఎంతో నమ్మకంతో ఒక దర్శకునిగా అవకాశం ఇచ్చి అది డిజాస్టర్ అయినప్పుడు ఆ దర్శకుని పరిస్థితి అయోమయంలో పడిపోతుంది.
'బ్రహ్మూెత్సవం' డిజాస్టర్తో శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన శర్వానంద్కి, అల్లుఅరవింద్కి ఓ కథ చెప్పి మెప్పించాడు. ఈ చిత్రం అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో తెరకెక్కనుంది. ఇక తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ తమ్ముడి పాత్ర కోసం కూడా ఓ హీరోని శ్రీకాంత్ అడ్డాల ఒప్పించాడు. 'అప్పట్లో ఒకడుండే వాడు, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ' చిత్రాలలో మెప్పించిన శ్రీవిష్ణుని ఈ చిత్రంలో తీసుకున్నారని తెలుస్తోంది. శర్వానంద్, శ్రీవిష్ణులు ఇద్దరు టాలెంటెడ్ యంగ్ హీరోలు కావడం వల్ల వీరు అన్నదమ్ములుగా కరెక్ట్గా సూట్ అవుతారని భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం గురించి త్వరలోనే గీతాఆర్ట్స్, శ్రీకాంత్ అడ్డాల నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మరి ఈ చిత్రంతోనైనా శ్రీకాంత్ అడ్డాల మరలా తన పాత ఫామ్ని దొరకబుచ్చుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది...!