Advertisement

'క్షణం' డైరెక్టర్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్!

Sat 07th Apr 2018 10:17 AM
allu arjun,vi anand,kshanam director,next movie  'క్షణం' డైరెక్టర్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్!
Allu arjun, Kshanam director to team up? 'క్షణం' డైరెక్టర్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్!
Advertisement

అడవి శేష్ కథ అందించి హీరోగా నటించిన  క్షణం సినిమా పివిపి నిర్మాణంలో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకు బోలెడన్ని లాభాలు వచ్చాయి. సినిమాకి దాదాపుగా ఐదారు కోట్ల లాభాలు నిర్మాతలు వెనకేసుకున్నారు. ఈ సినిమాని దర్శకుడు రవికాంత్ పెరెపు ఎంతో థ్రిల్లింగ్ గా క్షణంని మలిచాడు. ఆదా శర్మ, అడవి శేష్, అనసూయ పెరఫార్మెన్స్ లతో క్షణం సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ప్రస్తుతం రవికాంత్ పెరెపు సిద్ధు జొన్నలగడ్డ - సీరత్ కపూర్ ల జంటగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇక రవికాంత్ పెరెపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని హీరో రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కథ రానాకీ నచ్చడంతో తానే స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇకపోతే  రవికాంత్ పెరెపు మరో కథని సెట్ చేసుకున్నాడట. ఆ కథ సూపర్బ్ గా ఉండడంతో.. ఆ కథను తన నిర్మాత రానాకి వినిపించగా.. రానా ఆ కథ అల్లు అర్జున్ కి సరిగ్గా సరిపోతుందని.. ఈ కథని అల్లు అర్జున్ కి వినిపించమని రవికాంత్ పెరెపు చెప్పడంతో  రవికాంత్ పెరెపు రానాకీ అల్లు అర్జున్ కి కలిపి కథని వినిపించగా అల్లు అర్జున్ కూడా ఈ కథకి బాగా కనెక్ట్ అయ్యాడనే టాక్ వినవస్తుంది.

రవికాంత్ పెరెపుతో సినిమా చేసే ఆలోచనలో బన్నీ ఉన్నట్లుగా  తెలుస్తుంది. ఎలాగూ వక్కంతం నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో కమిట్ అవ్వలేదు.  రవికాంత్ పెరెపు చెప్పిన కథ డిఫరెంట్ సబ్జెక్ట్ కావడంతో.. ఈ చిత్రంపై అల్లు అర్జున్ మక్కువ చూపుతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు సాధ్యమైతే.. ఈ సినిమాని కూడా  తానే నిర్మిస్తానని చెప్పాడట రానా దగ్గుబాటి.  అలాగే  రవికాంత్ ని కంప్లీట్ స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేయాల్సిందిగా సూచించారట రానా అండ్ అల్లు అర్జున్ లు. మరి అల్లు అర్జున్ ఒక్క క్షణం డైరెక్టర్ వి ఐ ఆనంద్ తో కూడా కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడనే ప్రచారం జరిగింది.

Allu arjun, Kshanam director to team up?:

Allu Arjun to collaborate with Kshanam director soon?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement