Advertisement

రాజీవ్ గాంధీ మరణానికి రూ.200 కారణమా..?

Mon 24th Oct 2016 10:20 PM
rajiv gandhi murder,hicourt judge sensational comment on rajiv gandhi murder,hicourt judge,justice chandra kumar reveled on rajiv gandhi murder  రాజీవ్ గాంధీ మరణానికి రూ.200 కారణమా..?
రాజీవ్ గాంధీ మరణానికి రూ.200 కారణమా..?
Advertisement
రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి హైకోర్ట్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారి పెను దుమారాన్ని రేపుతున్నాయి. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఓ హెడ్ కానిస్టేబుల్ కేవలం రూ. 200 కి కక్కుర్తి పడి లంచం తీసుకోవడం కారణంగా మనం గొప్ప ప్రధానిని పోగొట్టుకున్నామని చావు కబురు చల్లగా చెప్పాడు. ఏళ్ళ తరబడి సమాజంలో నాటుకుపోయిన అవినీతిని తెగనరకాల్సిన అవసరం ఎంతైనా ఉందని  ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు. ఓ హెడ్ కానిస్టేబుల్ రెండువందల రూపాయలకు కక్కుర్తి పడి తీసుకోవడం మూలంగానే ఎల్టీటీఈ దళం ఆత్మహుతి దాడి జరపడానికి కారణం అయిందని ఆయన వివరించాడు.
కాగా జాతీయ అవినీతి కౌన్సిల్ హైదరాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఓ చిన్న స్థాయిలో జరిగిన అవినీతి కారణంగానే ఎల్టీటీఈ ఆత్మహుతి దాడికి పాల్పడగలిగిందని ఆయన తెలిపాడు. కాగా దేశంలో జరుగుతున్న అవీనితి, ప్రజాసమస్యలపై మీడియా ఎప్పటికప్పుడు పోరాడుతూనే  ఉండాలని ఆయన వెల్లడించాడు.
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement