ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రస్తుత లక్ష్యమిదే?

CineJosh news

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, బిజెపిని దెబ్బకొట్టి అధికారం చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబు, గోవా రాష్ట్రాలను ఆయన తన లక్ష్యంగా ఎంచుకున్నారు. చిన్న రాష్ట్రాలైన ఈ రెండింటిలో తమకు వచ్చే మద్దతుపై పునరాలోచించుకుని ఆపై దేశవ్యాప్తంగా ఎలా బలపడాలో చూడాలని కేజ్రీవాల్‌ ఓ నిర్ణయానికి వచ్చారు. అదే ఉత్తరప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రంపై దృష్టిపెడితే పంజాబు, గోవాలకు న్యాయం చేయలేమని, అందుకే ముందు ఈ రెండు చిన్న రాష్ట్రాల్లో పాగా వేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఈరెండు రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే ఆప్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయనే చెప్పవచ్చు. మరి ఈ విషయంలో కేజ్రీవాల్‌ ఢిల్లీలో వలే సక్సెస్‌ అవుతాడా?లేదా? అనేది వేచిచూడాల్సివుంది. 

aap
kejrival
punjab
goa elections
uttar pradesh
delhi