Loading...

సిద్ధార్థ్ కు జోడీ దొరికేసింది!

'నేను శైలజ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి కీర్తి సురేష్. ఆ సినిమాకు మంచి అప్లాజ్ రావడంతో తెలుగునాట కీర్తికు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తాయని అంచనా వేశారు. మహేష్ బాబు తో కలిసి కీర్తి నటించనుందనే వార్తలు వచ్చాయి కానీ అవనీ రూమర్స్ గా మిగిలిపోయాయి. ఇక చేసేదేమీ లేక కోలీవుడ్ కు వెళ్ళిపోయింది కీర్తి. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ.. బిజీగా మారిపోయింది. ఈ తరుణంలో తెలుగులో తనకొక అవకాసం దొరికినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ హీరోగా 'గుంటూర్ టాకీస్' దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ రొమాంటిక్ లవ్ స్టొరీను సినిమాగా చేయనున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ కు జంటగా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.   

keerthi suresh
nenu sailaja
siddharth
praveen satthaaru