Advertisement

మణిరత్నం పై ఉండే నమ్మకం అది..!

ఇటీవల వరుస ఫ్లాప్ లో ఉండి ఫామ్  కోల్పోయినప్పటికీ మణిరత్నం సినిమాకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితం అయింది. ఆయన ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ లతో 'ఓకే కన్మణి' అనే చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాడు. ఈ చిత్రం దిల్ రాజు సమర్పణలో విడుదల కానుంది. చాలాకాలంగా నిరాశ పరుస్తున్నప్పటికీ..  మణిరత్నం పై నమ్మకం సడలిపోలేదనడానికి ఈ చిత్రం తమిళ్, మలయాళంలో చేస్తున్న బిజినెస్ ఉదాహరణగా చెప్పవచ్చు. మొత్తానికి తెలుగులో 'ఓకే బంగారం' టైటిల్ తో రానున్న ఈ చిత్రం దిల్ రాజు అండతో తెలుగులో ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో  వేచిచూడాల్సివుంది..! ఈ చిత్రం ఆడియో రిలీజ్, ప్రమోషన్ కార్యక్రమాలను మార్చిలో ప్రారంభించి  ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్, పి. సి. శ్రీరాం వంటి అద్భుత టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. 

maniratnam
dil raju
ok kanamani
ok bangaram