Advertisement

'ముకుంద' నష్టం ఎంత..?

Sat 07th Feb 2015 02:00 AM
varun tej,sreekanth addala,mukunda,distributors  'ముకుంద' నష్టం ఎంత..?
'ముకుంద' నష్టం ఎంత..?
Advertisement

శ్రీకాంత అడ్డాల దర్శకత్వం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేస్తూ వచ్చిన చిత్రం 'ముకుంద'. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటించింది. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుండే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే చిత్ర యూనిట్ ఎక్కడా నిరాశపడకుండా ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్లు పెరగడానికి ఎంతో కొంత పబ్లిసిటీ పని చేసింది. అయితే ట్రేడ్ లో చెబుతున్న దాని ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ని మొత్తం 18 కోట్లకు అమ్మారు. అయితే అన్ని కలిపి కేవలం 12 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలింది నష్టంగా చెబుతున్నారు. నిర్మాతలు సొమ్ము చేసుకున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్ల చేతులు మాత్రం కాలాయి అనేది ట్రేడ్ సమాచారం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement