నందమూరి తారక రామారావు, బసవరామ తారకం పెద్ద కోడలు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సోదరి, నందమూరిజయకృష్ణ భార్య పద్మజ (73) ఈ నెల 19 న అనారోగ్య కారణాలతో పరమపదించారు. ఆమె మరణించిన పదమూడువరోజున కుటుంబ సభ్యులు దశదిన ఖర్మ నిర్వహించారు.
హైదరాబాద్ లో పద్మజ దశదిన ఖర్మ ను నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, నందమూరి చైతన్య కృష్ణ, ఎంపీ భరత్, నందమూరి కళ్యాణ్ రామ్ సహా నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో సహా బందుమిత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని నందమూరి జయకృష్ణ భార్య పద్మజ కి నివాళులర్పించారు.