Advertisement

'బ్యాంకాక్ లో..? ఏం జరిగింది' సినిమా ప్రారంభం!

Mon 27th Jun 2016 07:45 PM
bangkok lo em jarigindi movie,naveen,kata prasad  'బ్యాంకాక్ లో..? ఏం జరిగింది' సినిమా ప్రారంభం!
'బ్యాంకాక్ లో..? ఏం జరిగింది' సినిమా ప్రారంభం!
Advertisement

నవీన్, మమతా కులకర్ణి, ఆరోహి, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్ పై కాటా ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్యాంకాక్ లో..? ఏం జరిగింది'. నందం రామారావు నిర్మాత. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టగా.. జూబ్లీహిల్స్ టిఆర్ఎస్ ఇంచార్జ్ మురళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

మురళి మాట్లాడుతూ.. ''ఈ సినిమా 40 రోజులు నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

దర్శకుడు కాటా ప్రసాద్ మాట్లాడుతూ.. ''మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ లవ్ స్టోరీ ఇది. సినిమాలో కామెడీ కూడా ఉంటుంది. 45 రోజులు సినిమాను బ్యాంకాక్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు. 

నిర్మాత రామారావు మాట్లాడుతూ.. ''కథ నచ్చి నా కుమారుడ్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాను. ఈ ఒక్క సినిమాతో ఆగిపోకుండా ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలను నిర్మించాలని భావిస్తున్నాను'' అని చెప్పారు. 

మ్యూజిక్ డైరెక్టర్ వేణు గజ్వేల్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేశాం. రిచ్ లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది'' అని చెప్పారు. 

హీరో నవీన్ మాట్లాడుతూ.. ''ఇది నా డెబ్యూ ఫిల్మ్. అందరం హార్డ్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్: వేణు గజ్వేల్, ఫొటోగ్రఫీ: సంతోష్ కె, నిర్మాత: నందం రామారావు, కో డైరెక్టర్: కృష్ణ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కాటా ప్రసాద్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement