Advertisement

దాసరికి సినిమా చూపించారు!

Mon 24th Aug 2015 06:37 AM
cinema chupistha mava,dasari narayanarao,trinadharao,bekkam venugopal  దాసరికి సినిమా చూపించారు!
దాసరికి సినిమా చూపించారు!
Advertisement

రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఆగస్ట్ 14న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ "పెద్ద సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ సంతోషంగా ఉంటారు. అదే చిన్న సినిమా హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రేక్షకులు గొప్పవాళ్ళు. సినిమా బాగుంటే చూస్తారు లేదంటే చూడరు. 'బాహుబలి', 'శ్రీమంతుడు' లాంటి పెద్ద చిత్రాల హిట్ తరువాత వచ్చిన 'సినిమా చూపిస్త మావ' కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. ఈ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీకు మంచి ఎనర్జీ వచ్చింది. సాధారణంగా ఓ సినిమా విజయం తరువాత ఆరునెలల వరకు ఇండస్ట్రీలో హిట్ అనేది రాదు. కాని రెండు భారీ ప్రాజెక్ట్స్ తరువాత వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మూడు నుండి నాలుగు కోట్లు పెట్టి తీసిన ఈ చిత్రం సుమారుగా 15 కోట్ల వరకు కలెక్ట్ చేయబోతోంది. ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది. గతంలో 'మామా అల్లుడు' చిత్రం తీశాను. ఆ చిత్రంతో పాటు 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా విడుదలయ్యింది. ఆ రెండు చిత్రాలు పెద్ద హిట్స్ అయ్యాయి. 'మామా అల్లుడు' చిత్రం అయితే సుదర్శన్ థియేటర్ లో 125 రోజులు ఆడింది. 'సినిమా చూపిస్త మావ' లో ఎలాంటి సీన్స్ ఉంటే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారో.. ఎలా తీస్తే ఫ్యామిలీస్ ను ఆకట్టుకోవచ్చో.. అని బాగా ఆలోచించి స్క్రిప్ట్ వర్క్ చాలా జాగ్రత్తగా చేసారు. డైరెక్టర్ మెరిట్ మీదే సీన్స్, షాట్స్ ఆధారపడి ఉంటాయి. సినిమాలో వచ్చే ప్రతి ఫ్రేములో దర్శకుడే కనిపిస్తున్నాడు. ఇది టెక్నీషియన్స్ పిక్చర్. టీమ్ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా. ప్రసన్న రాసిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ఇంత అధ్బుతమైన డైలాగ్స్ ఉన్న సినిమా నేను ఇప్పటివరకు చూడలేదు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పిల్లి కళ్ళ పాప అనే పాట నాకు చాలా నచ్చింది. బడ్జెట్ లిమిటేషన్ లో ఫోటోగ్రఫీ చక్కగా చేసారు. చాలా రోజుల తరువాత సంతృప్తిగా ఫీల్ అయిన సినిమా ఇది. రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి హీరో అయ్యాడు. మెచ్యూర్డ్ గా నటించాడు. అవికా అందంగా క్యూట్ గా ఉంది. రావు రమేష్ చాలా బాగా నటించాడు. సినిమా చుసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి మరీ చెప్పాను. ఆర్టిస్ట్స్ అంతా చక్కగా నటించారు. ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తేనే ఇండస్ట్రీ కలకళ్ళాడుతుంది" అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో త్రినధరావు నక్కిన, బెక్కం వేణుగోపాల్, ప్రసన్న కుమార్, తోటపల్లి మధు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement