Advertisement

అడవి శేష్ కి అనసూయ ఓకే చెప్పింది!

Sat 28th Mar 2015 09:24 AM
adivi sesh,adah sharma,anasuya,pvp banner  అడవి శేష్ కి అనసూయ ఓకే చెప్పింది!
అడవి శేష్ కి అనసూయ ఓకే చెప్పింది!
Advertisement

అదా శర్మ, అనసూయలతో అడవి శేష్.. 

ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి మంచి జోరుమీదుంది. ఒకవైపు భారి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూనే.. మరోవైపు కొత్త దర్శకులతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను పట్టాలేక్కిస్తుంది. అడవి శేష్ హీరోగా రవికాంత్ పెరేపు దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ వార్త బయటకొచ్చింది. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో అడవి శేష్ సరసన అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. హాట్ యాంకర్ అనసూయ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు క్షణం అనే టైటిల్ ఖరారు చేశారు.   

కర్మ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయమైన అడవి శేష్ హిట్ అందుకోలేకపోయాడు. తర్వాత పవన్ కళ్యాణ్ పంజా, రవితేజ బలుపు, రన్ రాజా రన్ సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసి మంచి గుర్తింపు పొందాడు. బాహుబలిలో నటిస్తున్నాడు. మధ్యలో హీరోగా నటించిన 'కిస్' ప్లాపయ్యింది. హీరోగా మూడో సినిమాతోనైనా హిట్ కొడతాడో..? లేదో..? వెయిట్ & సి.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement