Advertisement

రియల్‌ స్టొరీ తో ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’!

Mon 16th Mar 2015 06:36 AM
chitram kadu nijam,good cinema group,maruthi,shailendra babu  రియల్‌ స్టొరీ తో  ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’!
రియల్‌ స్టొరీ తో ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’!
Advertisement

2010లో ఆరుగురు ఫ్రెండ్స్‌ సరదాగా ట్రక్కింగ్‌ చేయడానికి మంగుళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోకి వెళ్లి, కనిపించకుండా పోయారు. అప్పుడు వాళ్లు తీసుకెళ్లిన కెమెరా 2012లో దొరకగా అందులోని విజువల్స్‌లో వాళ్లు ఏ విధంగా కనపడకుండా పోయారో తెలిసింది. ఇప్పుడు ఆ విజువల్స్‌ని సినిమా రూపంలో ఎడిటింగ్‌ చేసి, యథాతధంగా అటవీశాఖ అనుమతితో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా...చిత్ర పరిశ్రమలోనే ఓ అరుదైన రికార్డుగా నిలుస్తుంది. ఈ డిఫరెంట్‌ సినిమాకు ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’ అనే టైటిల్‌ పెట్టారు. ఈరోజుల్లో, రొమాన్స్‌, విల్లా, భద్రమ్‌ వంటి విజయవంతమైన వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. రమేష్‌ ఈ ఫుటేజ్‌ని షూట్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదలవుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ను మార్చి 16న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రముఖ కన్నడ నిర్మాత శైలేంద్రబాబు ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైజాగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ విద్యాసాగర్‌, ఎడిటర్‌ శ్రీనాథ్‌, శ్రేయాస్‌ మీడియా శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా..

మారుతి: ఈ సినిమా చాలా క్రియేటివ్‌గా వుంది. కన్నడలో పెద్ద హిట్‌ అయిన ఈ సినిమాని తెలుగులో ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ లేకుండా ఎంతో నేచురల్‌గా చిత్రీకరించడం జరిగింది. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది.

శైలేంద్రబాబు: నేను కన్నడలో 20 సినిమాలు నిర్మించాను. ఈ చిత్రాన్ని కన్నడలో చూసి తెలుగులో చేస్తే బాగుంటుందని మారుతిగారికి చెప్పాను. గుడ్‌ సినిమా గ్రూప్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాము. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

గుడ్‌ఫ్రెండ్స్‌: ఓ అరుదైన సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మంగుళూరుకు సమీపంలోని ఫారెస్ట్‌లో ఆరుగురు ఫ్రెండ్స్‌ కనిపించకుండా పోయిన సంఘటనల సమాహారమే ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’. వాళ్లు కనిపించకుండా పోయినా, వారికి సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. అందులోని విజువల్సే ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’. అంటే ఏ ట్రూ ఫుటేజ్‌ ఫిల్మ్‌. అటవీశాఖ అనుమతి తీసుకొని ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఈరోజుల్లో, రొమాన్స్‌, భద్రమ్‌, విల్లా వంటి వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్‌ సినిమా గ్రూప్‌ ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’  వంటి అద్భుతమైన సినిమా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ తో కలిసి రిలీజ్‌ చేస్తున్నాం. మార్చి 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement