Advertisementt

మోడీ పిలిస్తేనే రాజధానికి వస్తారట..!

Thu 01st Oct 2015 02:01 AM
ap capital,japan,singapur,narendra modi,prime ministers  మోడీ పిలిస్తేనే రాజధానికి వస్తారట..!
మోడీ పిలిస్తేనే రాజధానికి వస్తారట..!
Advertisement
Ads by CJ

ఏపీ రాజధాని శంఖుస్థాపను సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జపాన్‌, సింగపూర్‌ ప్రధానులతోపాటు భారత ప్రధాని మోడీని కూడా శంఖుస్థాపనకు ఆహ్వానించి ప్రపంచ దేశాల్లో ఇన్వెస్టర్లను దృష్టిని ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మోడీ రాక ఇప్పటికే ఖరారు కాగా జపాన్‌, సింగపూర్‌ల ప్రధానుల వస్తారా..? రారా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఏపీ రాజధాని డెవలప్‌మెంట్‌ ప్రణాళికను బాబు సింగపూర్‌ ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఆ దేశంలో పర్యటించి అక్కడి మంత్రులతోపాటు ప్రధానిని కూడా కలిశారు. అంతేకాకుండా జపాన్‌ ఇన్వెస్టర్లను కూడా ఏపీ రాజధానివైపు ఆకర్షించడానికి బాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఇరు దేశాల ప్రధానులకు ఇప్పటికే శంఖుస్థాపనకు ఆహ్వానాలు అందాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఇతర దేశాల ప్రధానులు మనదేశంలో పర్యటించడం గతంలో ఎన్నడూ జరగలేదు. దీంతో ఈ ఇరువురికి కేంద్రంనుంచి ఆహ్వానాలు పంపించాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని మోడీకి విన్నవించినట్లు సమాచారం.

అయితే శంఖుస్థా పను ఆ రెండు దేశాల ప్రధానులు హాజరవుతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. కాని ప్రధాని నుంచి ఆహ్వానం లేనిది వారిరువురూ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు లేవని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ దేశాల ప్రధానుల రాక ఇప్పుడు మోడీ ఆహ్వానంపై ఆధారపడి ఉంటుంది. ఏపీకి ఇచ్చిన హామల అమలును మరిచిన మోడీ రాష్ట్రం కోసం కనీసం ఆ దేశాల ప్రధానులనైనా ఆహ్వానిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ