RGV రైటర్గా సెటిలైనట్టేనా?
Maverick Director teams with Saiyaara makerబాలీవుడ్ ప్రముఖ దర్శకులు మోహిత్ సూరి - రామ్ గోపాల్ వర్మ కలసి ఓ క్రేజీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ఈ ఇద్దరు సంచలన దర్శకులు తొలిసారిగా చేతులు కలిపి ఓ సరికొత్త గ్యాంగ్స్టర్ కథను సిద్ధం చేస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. రామ్గోపాల్ వర్మ అందించిన కథతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోలకు ప్రాధాన్యత ఉండటంతో ఇండస్ట్రీలోని ఇద్దరు టాప్ స్టార్లను ఈ పాత్రల కోసం తీసుకునే ప్రయత్నాలలో దర్శకుడు మోహిత్ సూరి ఉన్నారు. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆర్జీవీ మార్క్ రైటింగ్, మోహిత్ సూరి టేకింగ్ తో పాటు వైఆర్ఎఫ్ నిర్మాణ విలువలు తోడవడంతో ఈ భారీ మల్టీస్టారర్ గ్యాంగ్స్టర్ డ్రామా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. అయితే ఆర్జీవీ తనే స్వయంగా డైరెక్ట్ చేయకుండా స్క్రిప్టు రాసి వైఆర్ఎఫ్ బ్యానర్ కి అమ్మడంతో అతడు ఇక రైటర్ గా సెటలైనట్టేనా? అంటూ అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.
















































