టాప్ డైరెక్టర్స్ - క్రేజీ కాంపిటీషన్

Top Directors – Intense Competition


ఎస్ ఎస్ రాజమౌళి అండ్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్. ఈ ఇద్దరు దర్శకులు వచ్చే ఏడాది సమ్మర్ లో సందడి చెయ్యబోతున్నాయి, ఢీ కొట్టబోతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కుతున్న వారణాసి, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కుతున్న స్పిరిట్.. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది సమ్మర్ లో పోటీపడబోతున్నాయి.

ఆ కాంపిటీషన్ కు ముందు ఈ దర్శకులు మరో రకంగా పోటీ పడడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అదెలా అంటే.. ఫహద్ ఫాసిల్ హీరోగా రూపొందిన మల్టీ లాంగ్వేజెస్ ఫిలిం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీకి రాజమౌళి ప్రెజెంటెటర్ గా వ్యవహరిస్తుంటే.. మరో చిన్న సినిమా రోమాంచికం అనే సినిమాకి సందీప్ రెడ్డి వంగ సమర్పకుడిగా క్రెడిట్ తీసుకున్నారు.

ఈ రెండు సినిమాలు రానున్న రోజుల్లో బాక్సాఫీసు దగ్గర పోటీపడబోతున్నాయి. ఏ కంటెంట్ నిమ్మి, ఏ కాన్సెప్ట్ పై కాన్ఫిడెన్స్ తో ఈ స్టార్ డైరెక్టర్స్ వాళ్ళ గుడ్ విల్ ని ఆ సినిమాలకు ఇన్వెస్ట్ చేసారు, దాని తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.  

S.S Rajamouli vs Sandeep Reddy Vanga