ఫ్యాన్స్ కు లేని బాధ మీకెందుకు

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు గత రెండు రోజులుగా ప్రముఖ వార్తాపత్రికల్లో, అలాగే ఛానల్స్ లో యాడ్స్ వేయిస్తున్నారు. తాజాగా వేయించిన యాడ్ పై కొంతమంది పనిగట్టుకుని ఎన్టీఆర్ కు బాలకృష్ణకు దూరమెంతో లెక్కలు వేస్తూ కథనాలు రాస్తున్నారు.
నందమూరి ఫ్యామిలీ పేర్లలో ఎన్టీఆర్ పేరు, కళ్యాణ్ రామ్ పేరు లేకపోవడం ఒత్తి ఒత్తి చూపిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు అయన భార్య, కొడుకు లోకేష్, భార్య బ్రాహ్మణి పేర్లు, బాలయ్య కూతుళ్లు, కొడుకు పేర్లు, అలాగే సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్ళు పేర్లు వేయించిన వారు ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ పేర్లను వేయించకపోవడం పై ఓ వర్గం మీడియా అభ్యంతరకర వార్తలు రాస్తుంది.
అంతేకాదు బాల బాబాయ్ ని పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా విషెస్ తెలిపిన ఎన్టీఆర్ ని ఆయన అన్నను కలుపుకోలేరా అని అడుగుతుంది. బాలయ్య ఏదైనా అనుకుంటే ఆ విషయంలో పట్టుదలతో ఉంటారంటూ మాట్లాడుతుంది. అయితే ఈవార్తలపై జూనియర్ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు.. అభిమానులకు లేని మీకెందుకు అన్నట్టుగా..
బాలయ్య కి పద్మభూషణ్ అవార్డు సందర్బంగా నారా ఫ్యామిలీ వేయించిన Adds అవి. వాళ్ళకి ఏ విధంగా యే వరస లో ఎవరు ఉండాలో యే ఫోటో లు ఎక్కడ ఉండాలో, ఎవరి పేర్లు ఉండాలో వాళ్ళ ఇష్టం. అంతే.. మధ్యలో మీకెందుకు అన్నట్టుగా వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Padma Bhushan Balakrishna ads controversy
Why do you feel the pain that the fan do not have





































