పవిత్ర లోకేష్ పై దారుణమైన ట్రోలింగ్

సీనియర్ నరేష్ తో పవిత్ర లోకేష్ సహజీవనం చెయ్యడం, నరేష్ ఆమెని నాలుగో పెళ్లి చేసుకుంటాను అనడంపై సోషల్ మీడియాలో, మీడియాలో సంచలనం అయ్యింది. పవిత్ర లోకేష్ తో కలిసి నరేష్ మైసూర్ హోటల్ రూమ్ లో నరేష్ మూడో భార్య రమ్యకి పట్టుబడడం ఇవన్నీ జనాల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఏది ఏమైనా తాను పవిత్ర లోకేష్ తోనే కలిసి ఉంటాను అన్నట్లుగా నరేష్ ప్రవర్తించాడు. ఈమధ్యన వారి మధ్యన విభేదాలు రాజుకున్నాయి, కలిసి కూడా జీవించడం లేదు అన్నప్పటికీ.. సూపర్ స్టార్ కృష్ణ గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు నరేష్ ఆమెతో కలిసి హాస్పటల్ కి వచ్చాడు. 
అంతేకాదు కృష్ణగారు మరణించిన తర్వాత కూడా పవిత్రని పట్టుకుని మరీ సూపర్ స్టార్ కి నివాళు అర్పించేందుకు తీసుకువచ్చాడు నరేష్. అలాగే కృష్ణగారి చిన్న కర్మలోను నరేష్-పవిత్ర ఇద్దరూ కలిసి కనిపించడం కాదు, ఇద్దరు కలిసి స్టేజ్ ఎక్కి కృష్ణగారి ఫోటోకి నమస్కారం పెట్టారు. ఇవన్నీ చూసిన నెటిజెన్స్ పవిత్రపై దారుణమైన ట్రోల్ చేస్తున్నారు.
కొంతమంది సోషల్ మీడియా వేదికగా నరేష్ అనవరసంగా పవిత్ర లోకేష్ ని తగిలించుకున్నాడు.. ఆమె సూపర్ స్టార్ ఇంట అడుగుపెట్టాక.. ఆ ఇంటి నుండి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముందుగా విజయ నిర్మల కాలం చెయ్యగా, తర్వాత కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు, తర్వాత మహేష్ తల్లి, ఇప్పుడు కృష్ణ గారు మృతి చెందారు. ఆమెది ఐరన్ లెగ్.. ఆమె ప్రవేశం ఘట్టమనేని కుటుంబానికి ప్రాణాంతకంగా మారింది.. అంటూ పవిత్ర లోకేష్ పై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు.

Trolls on Pavitra Lokesh and Naresh

Atrocious trolling on Pavitra Lokesh
pavitra lokesh
naresh