పూరి-ఛార్మి మధ్యలో పవిత్ర పూరి

పూరి జగన్నాధ్ దర్శకుడిగానే కాదు ఛార్మి సహాయంతో పూరి కనెక్ట్స్ పేరుతొ నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా డైరెక్ట్ చెయ్యడం మాత్రమే కాదు ఆ సినిమాని నిర్మించారు. అలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ తో JGM కూడా చేస్తున్నారు. పూరి దర్శకుడి గా సినిమాలు చేస్తుంటే.. ఛార్మి నిర్మాతగా.. అన్ని పనులు చక్కబెడుతుంది. పూరి కనెక్ట్స్ నడుస్తుంది అంటే చాలా వరకు ఛార్మి నే కారణం. పూరి అన్ని విషయాల్లో ఛార్మి అండగా ఉంటూ వచ్చింది.
అయితే తాజాగా పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొడుకు ఆకాష్ పూరి హీరోగా నిలబడడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూతురు పవిత్ర హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది అని, ఇప్పుడు పవిత్ర పూరి పూరి కనెక్ట్స్ లో వన్ అఫ్ ద నిర్మాతగా ఉండబోతుంది అని సమాచారం. అలా ఛార్మి కి పూరి కనెక్ట్స్ లో కాస్త ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది.
Pavitra Puri Entry to Tollywood
Puri Jagannadh Daughter Pavitra Entry to Tollywood






































