మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ ఇదే

మా ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లు హోరా హోరీగా మా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందు నుండి ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు అన్న రేంజ్ లో సాగుతున్న మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఎప్పుడో తన ప్యానల్ ని ప్రకటించేసారు. ఇక తాజాగా మంచు విష్ణు తన ప్యానల్ తో రంగంలోకి దిగబోతున్నారు. తాజాగా మంచు విష్ణు తన ప్యానల్ ని ప్రకటించారు. అందులో మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ పడుతుంటే.. రఘు బాబు జనరల్ సెక్రటరిగాను, మాదాల రవి వైస్ ప్రెసిడెంట్ గాను, బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గాను, పృద్వి రాజ్ వైస్ ప్రెసిడెంట్ గాను, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరిగాను, శివ బాలాజీ ట్రేసరర్ గాను పోటీ పడుతున్నారు.
ఎగ్జ్యుక్యూటివ్ మెంబెర్స్ గా చాలామంది ని మంచు విష్ణు రంగంలోకి దింపారు. ఇక ఈ మా ఎన్నికలు అక్టోబర్ 10 న జరగబోతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ తో లంచ్ మీటింగ్స్, డిన్నర్ పార్టీలు అంటూ మా ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలుస్తుందో.. మంచు విష్ణు ప్యానల్ గెలుస్తుందో.. అనేది అక్టోబర్ 10 సాయంత్రానికి తేలిపోతుంది.
Vishnu Manchu will announce his panel members for MAA Elections
Manchu Vishnu Panel Members List In MAA Elections 2021







































