ఆదిపురుష్ కి ఆటంకం

ముంబైగా లో మహా జనతా కర్ఫ్యూ.. మహారాష్ట్రలో షూటింగ్స్ బంద్.. అయినా ఓం రౌత్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదిపురుష్  సినిమా షూటింగ్ ఆగలేదు. ఆదిపురుష్ కోసం వేసిన భారీ సెట్ లో ఆదిపురుష్ షూటింగ్ చిత్రీకరణ చెప్పారు. అయితే అక్కడ ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ సేఫ్ కాదని, తెలంగాణాలో కరోనా కేసులు తక్కువగా ఉన్న కారణంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ సెట్ వేసుకుని మూడు నెలల పాటు ఆదిపురుష్ షూటింగ్ ఇక్కడే చేద్దామని టీం మొత్తం హైదరాబాద్ కి రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రభాస్ ముంబై నుండి హైదరాబాద్ కి చేరుకున్నారు. కానీ ఇక్కడ లాక్ డౌన్ పెడతారని కేసీఆర్ నిన్నటివరకు చెప్పలేదు. లాక్ డౌన్ పెట్టామనే అన్నారు. అందుకే ఆదిపురుష్ టీం ఇక్కడ షూటింగ్ కి మొగ్గు చూపింది

కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టేసింది కేసీఆర్ ప్రభుత్వం. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ని ఓ 10 రోజుల పాటు విధించింది. మరి లాక్ డౌన్ సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోవాల్సిందే. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి అనుమతులు లాక్ డౌన్ మార్గదర్శకాల్లో ఇవ్వలేదు. దీన్ని బట్టి ఆదిపురుష్ షూటింగ్ కూడా ఆపాల్సిందే. ముంబైగా లో ఆపుకుని హైదరాబాద్ వస్తే.. ఇక్కడ కూడా ఆదిపురుష్ కి ఆటంకం తప్పలేదు. ప్రభాస్ అండ్ టీ అంత రెడీ గా ఉన్నప్పటికీ. లాక్ డౌన్ అందరిని ఇంట్లో కూర్చోబెట్టేసింది.

Telangana to impose lockdown from May 12

Trouble for Adipurush Shoot
telangana
adipurush pan india film
om raut
prabhas
trouble for adipurush shoot
lockdown from may 12