మహేష్ ఫాన్స్ కి షాక్

కరోనా సెకండ్ వేవ్, తెలంగాణ లాక్ డౌన్ తో ఇప్పుడు సినిమా షూటింగ్స్ కూడా బంద్ అవ్వాల్సిన పరిస్థితి. ఎలాగూ కరోనా కారణంగా మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అదంతా అలా ఉంటే.. ఇప్పుడు మహేష్ బాబు ఫాన్స్ కి భారీ షాక్ తగిలింది. ఎలా, ఎందుకు అంటే మహేష్ బాబు కొత్తగా మరో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మూవీకి కమిట్ అయ్యి అనౌన్సమెంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ SSMB28 కృష్ణ గారి పుట్టిన రోజు అంటే మే 31 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అనే టాక్ ఉంది.

అయితే సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉన్న కారణంగా మహేష్ కొత్త సినిమా ఓపెనింగ్ ఆ రోజు జరుగుతుందా? లేదా? అనే డౌట్ కొడుతోంది. అలాగే గత ఏడాది మే 31 న పరశురామ్ - మహేష్ బాబు కాంబో సర్కారు వారి పాట పూజా కార్యక్రమాలతో మొదలైనా సినిమా రెగ్యులర్ షూట్ మాత్రం ఈఏడాది జనవరి లో మొదలైంది. ఇప్పుడు ఆ సినిమా లో మహేష్ లుక్ కృష్ణ గారి పుట్టిన రోజు స్పెషల్ గా రాబోతుంది అంటున్నారు. ఇక త్రివిక్రమ్ - మహేష్ మూవీ కూడా సింపుల్ గా పూజా కార్యక్రమాలతో మొదలయినా.. సర్కారు వారి పాట నుండి ట్రీట్ మాత్రం రాదని అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వలన కరోనా ఉధృతితో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న కారణంగా సెలెబ్రేషన్స్ కరెక్ట్ కాదని సర్కారు వారి పాట టీం కామ్ అవుతున్నట్టుగా టాక్. ఇది విన్న మహేష్ ఫాన్స్ అప్పుడే డిస్పాయింట్ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు.

Big shock to Mahesh fans

A big shock to Mahesh fans
mahesh babu
mahesh fans
sarkaru vaari paata movie
krishna birthday special
ssmb28
mahesh - trivikram combo
mahesh - parasuram combo
Advertisement
Advertisement