రష్మిక కలలపై కాటేసిన కరోనా..

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. పూజా హెగ్డే తర్వాత రష్మికకే అంతటి స్టార్ డమ్ ఉందని చెప్పగలం. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో పాటు భీష్మ సినిమా కూడా విజయవంతం కావడంతో ఆమెకి తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం రష్మికకి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. దాంతో ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.
అయితే పారితోషికం విషయంలో ఆమెకి ఓ టార్గెట్ ఉండిందట. ఈ ఏడాది రెండుకోట్ల రూపాయల పారితోషికం తీసుకోవాలని భావించిందట. అందుకు తగ్గట్టుగానే ఆమె చేతిలో మంచి మంచి సినిమాలు ఉన్నాయి. బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఆమె టార్గెట్ రీచ్ అయ్యుండేదట.
కానీ కరోనా వల్ల థియేటర్లు మూతబడిపోయి ఇండస్ట్రీ ఆర్థికంగా నష్టపోవడంతో ఆమె కలలకి కత్తెర పడింది. ఈ కష్టకాలంలో ఆమె టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మించడానికి గతంలోలా కోట్లకి కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చుకోలేరు.. సో రష్మిక కల కలగానే మిగిలిపోనుంది.
Rashmika Mandanna Dream failed due to corona
Rashmika Mandanna Dream failed due to corona..







































