ప్రేక్షకులను ప్రాధేయపడుతున్నారు!!

News About Evaru MovieNews About Evaru Movie

థ్రిల్లర్ సినిమాల్లో ట్విస్టులు చాలా కీలకం. అవి ప్రేక్షకులకి ఎంత బాగా కనెక్ట్ అయ్యాయి అనే సినిమా రన్ అవుతుంది. ఈనేపధ్యంలో నిన్న అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎవరు’ సినిమా సక్సెస్ అయింది. సినిమా మొదటి నుండి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగె కథలో చాలా రకాలుగా ట్విస్ట్స్ ఉంటాయి. అవి ప్రేక్షకులు కూడా పెట్టుకోలేని ట్విస్టులు. ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే ఇప్పటివరకు టాలీవుడ్ లో అయితే రాలేదు. ఇది అటువంటి సినిమా. అయితే ఈ ట్విస్టుల గురించి సామాజిక మాధ్య‌మాల్లో జ‌నాలు అత్యుత్సాహంతో రివీల్ చేసేస్తుండ‌టంతో చిత్ర బృందానికి ఇబ్బందిగా మారింది.

దాంతో చిత్రం టీం అడివి శేష్, నవీన్ చంద్ర, రెజినా ముగ్గురు కలిసి ఓ వీడియో రూపంలో అప్పీల్ చేసారు. సోషల్ మీడియాలో చాలా చోట్ల ఈ సినిమాకు సంబందించిన వీడియోలు, ఫొటోలు తీసి పెట్టేస్తున్నార‌ని.. ముఖ్యంగా సినిమాలో అత్యంత కీల‌క‌మైన ఇంట‌ర్వెల్, క్లైమాక్స్ ట్విస్టుల్ని రివీల్ చేస్తున్నారు అని అలా చేస్తే నెక్స్ట్ చూసేవారికి సినిమా పెద్దగా నచ్చదు అని థ్రిల్ మిస్ అయిపోతార‌ని అన్నారు టీం.

ఎస్ మీ అందరికి సినిమా బాగా నచ్చిందని అర్ధం అవుతుంది. కానీ ఆలా ట్విస్టులు రివీల్ చేయకండి అని రిక్వెస్ట్ చేసారు. ఈసినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అడివి శేష్ ఖాతాలో మరో హిట్ పడింది.

News About Evaru Movie

evaru movie
adivi sesh
slick thriller
regina cassandra