ప్రాణం ఖరీదు లేటెస్ట్ అప్డేట్

ప్రశాంత్, అవంతిక హీరోహీరోయిన్లుగా నందమూరి తారకరత్న ముఖ్యపాత్రలో యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పి.ఎల్.కె .రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ చిత్రం మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ నుంచి యూబైఏ సర్టిఫికేట్ను సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ప్రాణం ఖరీదు మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యూబైఏ సర్టిఫికేట్ రావడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు యూనిట్ను అభినందించడం మాకు మరింత ఆనందాన్ని కలిగించింది. చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అన్నారు.
నటీనటులు ప్రశాంత్, అవంతిక, నందమూరి తారకరత్న, షఫి, జెమినీ సురేష్, చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి( జబర్దస్త్ ఫేమ్) సంజన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరామెన్: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, మాటలు: మరుధూరి రాజా, పి.ఆర్.ఓ: కడలి రాంబాబు, నిర్మాత: నల్లమోపు సుబ్బారెడ్డి, దర్శకత్వం: పి.ఎల్.కె. రెడ్డి.
Pranam Kharidhu movie Censor Completed
Pranam Kharidhu Movie Latest Update







































