'కాలా' దెబ్బకి '2.0' బయ్యర్స్ లో వణుకు!

జూన్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన 'కాలా' చిత్రం ప్రేక్షకులని నిరాశ పరిచిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో 7 కోట్ల షేర్ ని వసూల్ చేసుకుని భారీ పరాజయం దిశగా సాగుతోంది. దీనికి వస్తున్న స్పందనతో 'రోబో 2.0' చిత్రాన్ని తెలుగులో రైట్స్ తీసుకోవడానికి బయర్స్ కు వణుకు మొదలైంది.

'కాలా' హక్కులను దాదాపు ఎనభై కోట్లు పెట్టు బయర్స్ తీసుకున్నారు అని టాక్. రజిని సినిమాలు వరసగా ప్లాప్ అవ్వడంతో..ఈ సినిమాను థర్డ్‌ పార్టీ వాళ్లు కొంటారా అనే అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని చెప్పుతున్నారు కానీ దానిపై పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగి బయ్యర్లకి నడ్డి విరిగిపోతోంది.

ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి అడుగుతారో అని ఎవరు ఆ సినిమా నిర్మాతలని అడగటానికి ట్రై చేయడం లేదు. ఒకవేళ సర్దుకుని సినిమా రిలీజ్ అయ్యే దాకా వెయిట్ చేసిన అప్పుడు సినిమా టాక్ ఏమాత్రం అటు ఇటుగా అయిందో ఆ నష్టాల నుండి బయర్స్ ని ఎవరు కాపాడలేరు. ఇలా బయ్యర్లు నష్టాలని దృష్టిలో పెట్టుకుని రజిని వెంటనే కార్తీక్‌ సుబ్బరాజ్‌తో సినిమా తీస్తున్నాడు అని సమాచారం.

Buyers and Distributors Unhappy Rajini Movies

2.0 Buyers Feared With Kaala
rajinikanth
kaala
2.0 movie
buyers
distributors
Advertisement
Advertisement