సన్నీపై కేసు పెట్టిన ప్రముఖ మోడల్!

CineJosh news

బాలీవుడ్ నటి సన్నీ తన పరువు తీసిందంటూ.. ప్రముఖ మోడల్ పూజా మిశ్రా బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. సన్నీ తన పరువుకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడిందని 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. బిగ్ బాస్ 5 షో లో ముందుగా ఎంట్రీ ఇచ్చి.. పాపులర్ అయింది తనే అని.. ఆ తరువాత  షో లోకి వచ్చిన సన్నీ తనను తక్కువ చేస్తూ.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిందని మిశ్రా తన పిటిషన్ లో పేర్కొన్నారు. సన్నీ మాట్లాడిన దానికి ఆర్థికంగా నష్టపోయానని.. పూజా మిశ్రా తెలిపారు. తన మీద ఐపిసి సెక్షన్ 500(డిఫామేషన్), 120 బి(కుట్ర) అభియోగాలతో చర్యలు తీసుకోవాలని పూజా మిశ్రా కోరారు. వేసవి సెలవుల తరువాత ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ చేయనున్నారు.

sunnyleone
pooja misra
big boss show
bombay high court