కాశ్మీర్ కు మహేష్ ప్రయాణం..!

CineJosh news

రీసెంట్ గా ఏ తెలుగు సినిమా కూడా కాశ్మీర్ లో షూటింగ్ నిర్వహించలేదు. అక్కడ షూటింగ్ చేయడం రిస్క్ అని ఎవరు సాహసించట్లేదు. కాని స్టార్ హీరో మహేష్ బాబు మాత్రం ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడట. శ్రీమంతుడు సక్సెస్ తరువాత మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మొత్సవం చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వలన చిత్రబృందం కాశ్మీర్ లో షూటింగ్ నిర్వహించాలని భావిస్తున్నారట. దీనికి మహేష్ బాబు సైతం ఓకే చెప్పాడని సమాచారం. ఇది ఎంత ఖర్చుతో కూడుకున్నదైనా నిర్మాతలు మాత్రం వెనకడుగు వెయ్యట్లేదు. ఓ మూడువారాల పాటు కాశ్మీర్ ప్రాంతంలో బ్రహ్మొత్సవం షూటింగ్ నిర్వహించనున్నారు. 

mahesh babu
brahmothsawam
srikanth addala
kashmir