దారం వివాదంపై స్పందించిన రెబెల్ కిడ్!
Apoorva Mukhija Breaks Silence on Coachella Row
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజా (రెబెల్ కిడ్) గతేడాది జరిగిన `కోచెల్లా కలావా` వివాదంపై తాజాగా స్పందించారు. అమెరికాలోని సంగీత ఉత్సవం `కోచెల్లా`కు హాజరైన సమయంలో చేతికి ఉన్న పవిత్ర దారమైన కలావాను కత్తిరించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, బెదిరింపులు ఎదుర్కొన్న అపూర్వ.. ఆ చేదు జ్ఞాపకాలు ..మానసిక సంఘర్షణ గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.
ఆ సంఘటన తన జీవితంలో అత్యంత కష్టమైన సమయమని.. మానసికంగా కుంగిపోయానని అపూర్వ తెలిపారు. `నేను ఉద్దేశపూర్వకంగా ఏ మతాన్ని లేదా ఎవరి భావాలను గాయపరచాలని అలా చేయలేదు. ఆ కత్తెరతో దారాన్ని తీసేటప్పుడు అది నా దేవుడిపై ఉన్న నమ్మకాన్ని తగ్గించదు. ఒక దారాన్ని కత్తిరించినంత మాత్రాన భగవంతుడికి ఎలాంటి తేడా రాదని.. ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకోడని నేను నమ్ముతాను` అని అపూర్వ స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ద్వేషం మానసికంగా విరక్తి కలిగించిందని పేర్కొన్నారు.
అయితే ఆ వివాదం తర్వాత ఎంతో నేర్చుకున్నానని, సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలు పంచుకోవాలి? దేనికి దూరంగా ఉండాలనే? స్పష్టత వచ్చిందని వివరించారు. నెటిజన్ల నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినా? నిజాయితీని వదులుకోనని.. తప్పులను ఒప్పుకుంటూ ముందుకు సాగడమే తన నైజమన్నారు. ఆ చేదు అనుభవం తదనంతర కాలం మరింత దృఢమైన వ్యక్తిగా మార్చిందని అపూర్వ ముఖిజా అభిప్రాయపడ్డారు.







































