Advertisement

మహేష్‌,నాగ్‌,మణి చిత్రం మూలన పడలేదు...!

Fri 29th May 2015 05:41 AM
maniratnam,maheshbabu,nagarjuna,aishwaryarai  మహేష్‌,నాగ్‌,మణి చిత్రం మూలన పడలేదు...!
మహేష్‌,నాగ్‌,మణి చిత్రం మూలన పడలేదు...!
Advertisement

మణిరత్నం దర్శకత్వంలో మహేష్‌బాబు, నాగార్జున హీరోలుగా ఐశ్వర్యారాయ్‌, శృతిహాసన్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం అనివార్య పరిస్థితుల్లో అటకెక్కిందనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఐశ్వర్యారాయ్‌ మాట్లాడుతూ... గతేడాది మణిరత్నం సినిమాలో నటించాల్సివుంది. అసలు ఆ సినిమాతోనే నా పునరాగమనం జరగాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమైంది. ఈలోగా మణిరత్నం గారు ‘ఓకే కమ్మణి’ చిత్రంతో బిజీ అయ్యారు. ఈమధ్య ఆయనే ఫోన్‌ చేసి మరలా పాత చిత్రం గురించి మాట్లాడారు. వీలు చూసుకొని ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయమని.. ఐశ్వర్య చెప్పుకొచ్చింది. నిజమే... ఆ చిత్రం చేయాలనుకున్నప్పుడు మహేష్‌బాబు మణిరత్నం పనైపోయిందని భావించాడు. తాజాగా ‘ఓకే కన్మణి’తో మణిరత్నం తన పూర్వవైభవాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఈ చిత్రం చేయడానికి మహేష్‌ అంగీకరించాడని సమాచారం. కాగా ఈచిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement