నాగ్ కేసులో కొండా సురేఖ కి బిగ్ షాక్

కింగ్ నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన నీచమైన కామెంట్స్ పై నాగార్జున కొండా సురేఖ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో నాగార్జున, ఆయన మేనకోడలు సుప్రియ, ఇంకా కొంతమంది సాక్ష్యులు కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు.
తాజాగా పరువు నష్టం కేసులో కొండా సురేఖ పై కేసు నమోదు చెయ్యాలని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా కొండా సురేఖ డిసెంబర్ 12న వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టులో హాజరవ్వాలని ఆమెకి బిగ్ షా ఇచ్చింది కోర్టు. మరి కొండా సురేఖ ఈకేసులో పర్సనల్ గా కోర్టు మెట్లు ఎక్కుతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
Nampally Court Big Shock To Konda Surekha
Big shock for Konda Surekhakonda surekha







































