బిగ్ బాస్ 8: మణికంఠకు నాగ్ వార్నింగ్

బిగ్ బాస్ 8 హౌస్ లో సింపతీ కోసం ఏడ్చే మణికంఠ కు నాగార్జున ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చినంత పని చేసారు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున మణికంఠను పిలిచి ఇక సింపతీ గేమ్ ఆపేయ్.. నీకు ఏడవాలనిపిస్తే ఇప్పుడే ఏడ్చేయ్ అంటూ మణికంఠ కు చెప్పారు నాగ్. దానితో మణికంఠ ఇకపై ఏడ్వను అని చేప్పి అలానే కూర్చున్నాడు.
దానితో నాగార్జున నీ భార్య నిన్ను విదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావ్, అయినా నీకు ఫుడ్ పంపించింది నీ వైఫ్ కాదు, నీ ఫ్రెండ్ అంటూ చెప్పేసరికి నాగమణికంఠ మరింతగా ఎమోషనల్ అయ్యాడు. ఇక నుంచి నువ్వు హౌస్ లో ఏడవకూడదు అంటూ నాగార్జున మణికంఠకు చెప్పారు.
ఇక యష్మి కి తండ్రి మెసేజ్ అందాలి అంటే ఆమె తన సీక్రెట్ బయట పెట్టాలని నాగ్ చెప్పగా యష్మి తన టాటూ సీక్రెట్ బయటపెటింది. ఇక ప్రేరణ ను బాగా ఆడుతున్నావంటూ నాగ్ మెచ్చుకున్నారు. సీత స్వార్ధంతో ప్రవర్తిస్తుంది అంటూ పృథ్వీ అలాగే ప్రేరణ తో పాటుగా నాగమణికంఠ కూడా చెప్పాడు.
Bigg Boss Telugu 8: Manikanta Receives Warning
Bigg Boss 8: Nag warning to Manikanta







































