మహిళా జాతికి జరిగిన అవమానం: NBK ఫాన్స్

ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ కుమార్తె రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను వారి సతీమణి ఈరోజు అసెంబ్లీలో వైసిపి అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణమని ఇది యావత్ మహిళా జాతికి జరిగిన అవమానంగా దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆల్ ఇండియా ఎన్.బి.కె ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ , బి బి జి తిలక్ అన్నారు.
ఇప్పటికే మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇటువంటి భాష వాడుతున్నారో రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందని వీర మన ప్రజా ప్రతినిధులు మరి ప్రజలు విస్తుపోతున్నారు అని ఈరోజు జరిగిన సంఘటన అసెంబ్లీ చరిత్రలో మాయని మచ్చగా నిలుస్తుందని ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గారిని టిడిపి క్యాడర్ ను ఎన్నో అవమానాలు గురిచేస్తూ ముఖ్యంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఈరోజు అతి నీచంగా చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను అందులో ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరి గారి గురించి అవమానకరంగా మాట్లాడటం చాలా దారుణం దీన్న ముక్తకంఠంతో నందమూరి అభిమానులు ఖండిస్తున్నారు అని తెలిపారు. అన్ని నియోజకవర్గాల లో జగన్ ,కొడాలి నాని ,అంబటి రాంబాబు ,చంద్రశేఖర్ రెడ్డి రోజా, కన్నబాబు ,వల్లభనేని వంశీ వారి దిష్టిబొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో తగలబెట్టాలని కోరుతూ ఆలిండియా ఎన్.బి.కె ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ ,బి బి జి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు.
YSR Congress MLAs made personal remarks about my wife: Nara Chandrababu Naidu
Shame on all women: All India NBK Fans






































