Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> First film to release in Theatres after lockdown..

లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి చిత్రం..

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పీఎమ్ నరేంద్రమోదీ చిత్రం అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ కాబోతుంది. కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకుంటున్న రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం పోస్టర్లోనే తెలిపింది.

లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి చిత్రం తమదే అంటూ ప్రచారం చేసుకుంది. వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా గత ఏడాది ఆల్రెడీ రిలీజైంది. ఐతే థియేటర్లు తెర్చుకుంటున్న వేళ మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఒమంగ్ కుమార్ దర్శకత్వ వహించిన ఈ సినిమాని సందీప్ సింగ్ నిర్మించారు. ఐతే కరోనా భయం ఇంకా జనాల్లో తగ్గలేదు. దసరాకి వదిలేద్దాం దీపావళికి థియేటర్లకి వెళదాం అన్న మూడ్ లో జనాలున్నారు. మరిలాంటి టైమ్ లో పీఎమ్ నరేంద్ర మోదీ చిత్రాన్ని చూడడానికి ఎంతమేర జనాలు థియేటర్లకి వస్తారో చూడాలి.

First film to release in Theatres after lockdown..

First film to release in Theatres after lockdown..
narendra modi
vivek oberoi
theatres
bollywood